న్యూఢిల్లీ: మానసిక అనారోగ్యం, న్యూరోసైకియాట్రిక్ వైకల్యం వంటి మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు గర్భాశయ క్యాన్సర్ వచ్చే ముప్పు రెండు రెట్లు అధికంగా ఉంటుందని స్వీడన్కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. 40 లక్షల మంది మహిళలపై వీరు చేసిన అధ్యయనం వివరాలు ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి.
మానసిక సమస్యలు ఉన్నవారు గైనకాలజీకి సంబంధించిన పరీక్షలు జరిపించుకునే అవకాశాలు తక్కువని, ఇదే వారిలో గర్భాశయ క్యాన్సర్ ముప్పును పెంచుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ముందస్తు నివారణ చర్యలో భాగంగా ఇలాంటి మహిళలను సంప్రదించి పరీక్షలు చేయించాలన్నారు.