పాట్నా: బీహార్కు చెందిన ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ సోమవారం కోర్టు గదిలో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో ఆయనను వెంటనే పాట్నా ఎయిమ్స్కు తరలించారు. మోకామా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన అనంత్ సింగ్, డాన్ నుంచి రాజకీయ నేతగా ఎదిగారు. ఆయనకు వ్యతిరేకంగా పలు నేరారోపణలు ఉన్నాయి. 2005, 2010 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ టికెట్పై పోటీ చేసి గెలిచారు. 2015లో పప్పు యాదవ్ మర్డర్ కేసులో అనంత్ సింగ్ అరెస్ట్ అయ్యారు. దీంతో ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఆయనకు టికెట్ నిరాకరించింది. అయినప్పటికీ జైలు నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనంత్ సింగ్కు ఆర్జేడీ టికెట్ ఇచ్చింది. దీంతో సొంత నియోజకవర్గమైన మోకామా నుంచి ఆయన మరోసారి విజయం సాధించారు. కాగా, లాడ్మాలోని ఆయన పూర్వికుల ఇంట్లో ఏకే-47, గ్రైనేడ్లు లభించిన కేసులో గత ఏడాది ఆగస్టులో అనంత్ సింగ్ ఢిల్లీ కోర్టులో లొంగిపోయారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.