డెహ్రాడూన్: తపోవన్ ఏరియాలో ఎన్టీపీసీ టన్నెల్ చిక్కుకున్న వారిని వెలికతీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నదని చమోలీ జిల్లా కలెక్టర్ స్వాతి బదోరియా తెలిపారు. ఎన్టీపీసీ తెలిపిన ప్రకారం సొరంగం పొడవు 136 మీటర్లు ఉందని ఆమె చెప్పారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గల్లంతైన వారి గాలింపులు కొనసాగుతున్నాయని ఆమె వెల్లడించారు. వరదల్లో మొత్తం 204 మంది గల్లంతు కాగా.. రైనీ గ్రామం సమీపంలో శుక్రవారం మరో మృతదేహంతో కలిపి మృతుల సంఖ్య 38కి చేరిందని చెప్పారు. మరో ఇద్దరు సురక్షితంగా తిరిగొచ్చారని, మిగతా 164 మంది కోసం సెర్చింగ్ కొనసాగుతున్నదని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.