న్యూఢిలీ:్ల బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ రైతుల ఆందోళనకు మద్దతు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి పరోక్షంగా సందేశం పంపారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 1980లో రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ మాట్లాడే వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. రైతులను అణచివేయవద్దని, అవసరమైతే వారితో కలిసి పోరాటం చేస్తామని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని వాజపేయి ఆ వీడియోలో హెచ్చరించడం గమనార్హం.