లక్నో: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు విధిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు కంప్లీట్ లాక్డౌన్ విధిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సైతం కరోనా కట్టడి కోసం కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఈ వారం నుంచి కరోనా మహమ్మారి ప్రభావం తగ్గేవరకు ప్రతి వారం శని, ఆదివారాలతో వీకెండ్ లాక్డౌన్ విధించనున్నట్లు ప్రకటించింది.
ముందుగా రాబోయే శని, ఆదివారాలతో వీకెండ్ లాక్డౌన్ను ప్రారంభించనున్నట్లు ఉత్తరప్రదేశ్ హోంశాఖ అదనపు చీఫ్ సెక్రెటరీ అవానిస్ కే అవస్థి తెలిపారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఈ లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. లాక్డౌన్ సమయంలో కేవలం అత్యావసర, నిత్యావసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి.
మునక్కాయల కన్న మునగాకే మిన్న..!
కేంద్రమంత్రి జితేంద్రసింగ్కు కరోనా
మే 1 వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ
సంచలన నిర్ణయం తీసుకున్న ఛార్మీ
ఐసీఎస్ఈ 10వ బోర్డు పరీక్షలు రద్దు..
వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తివేత!