న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్ఐ)లో భారత్ 101వ ర్యాంకుకు దిగజారింది. గతేడాది 94వ ర్యాంక్లో ఉండగా ఈ ఏడాది మరో 7 ర్యాంకుల కిందకు పడిపోయింది. మొత్తం 116 దేశాలు ఉన్న జాబితాలో పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ కంటే చాలా వెనుకబడింది. 5 కంటే తక్కువ జీహెచ్ఐ స్కోరుతో చైనా, బ్రెజిల్, కువైట్ తదితర 18 దేశాలు ప్రథమ ర్యాంకు సాధించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పోషకాహార లోపాన్ని జీహెచ్ఐ అంచనా వేస్తుంటుంది. వివిధ ప్రమాణాల ఆధారంగా జీహెచ్ఐ ర్యాంకులను నిర్ణయిస్తారు. వాటిలో చైల్డ్ స్టంటింగ్ (ఐదేండ్లలోపు పిల్లలు తమ ఎత్తుకు తగిన బరువు లేకపోవడం) ఒకటి. ఇది భారత్లో 1998-2002లో 17.1 శాతం ఉండగా 2016-20 మధ్య 17.3 శాతానికి పెరిగిందని జీహెచ్ఐ వెల్లడించింది