న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా బారీన పడిన రోగులకు మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగిపోయింది.
దీంతో పారిశ్రామిక అవసరాలకు ఉత్పత్తి చేసే ఆక్సిజన్ను దవాఖానలకు మళ్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది.
మహారాష్ట్ర, ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన ఆక్సిజన్ కొరత ఏర్పడింది. తత్ఫలితంగా ప్రాణాంతక కరోనా నుంచి రోగులకు కాపాడేందుకు ఆక్సిజన్ కొరత లేకుండా కేంద్ంర ఈ నిర్ణయం తీసుకున్నది.
అధిక కేసులతో బాధపడుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ ఉన్నాయని కేంద్ర హోంశాఖ పేర్కొంది.
కరోనా రోగులకు చికిత్స అందించడంలో కీలకమైన ఆక్సిజన్ను సరఫరా చేసేందుకు త్వరలో రైల్వేశాఖ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ నడుపనున్నది. కొద్ది రోజుల పాటు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడువనున్నాయి.
ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తమకు భారీగా మెడికల్ ఆక్సిజన్ అవసరం అని తెలిపాయి. అందుకోసం ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వేశాఖను కోరాయి.
ఇప్పటికే దేశంలో ఉత్పత్తి చేస్తున్న ఆక్సిజన్లో 60 శాతం దవాఖానలకే మళ్లించినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తెలిపింది.
పెండ్లి గౌనులో వచ్చి కరోనా టీకా తీసుకున్న యువతి.. అసలు కారణం తెలిసి షాకైన వైద్య సిబ్బంది
57 దేశాల్లోని మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు..!
త్వరలో కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం : ఆదిత్యా ఠాక్రే
ప్రిన్సిపాల్ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య
నిత్యం 3 లక్షల రెమ్డెసివిర్ డోసుల ఉత్పత్తి : మన్సుఖ్ మాండవీయ
రేపు అంగారకుడిపై ఎగరనున్న నాసా హెలికాప్టర్
పేదల బాగు కోసం భూదానం.. చరిత్రలో ఈరోజు
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్ఖాన్
రాత్రి విధుల పేరిట మహిళలకు ఉద్యోగాలివ్వరా?: కేరళ హైకోర్టు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..