ఊట్కూర్: కేసీఆర్ మార్గనిర్దేశంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రతి పక్షాలు చేసే విమర్శలను ఎవరి స్థాయిలో వారు తిప్పి కొట్టాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆది వారం ఊట్కూర్ మండల టీఆర్ఎస్ కార్యకర్తల సమా వేశం జరిగింది.
అన్ని సామాజిక వర్గాలకు సమతుల్యత పాటిస్తూ పార్టీలో పదవులను కట్టబెట్టామని, పనిచేసే కార్యకర్తలకు పార్టీ ఎల్లవే ళలా అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరా రు. నూతనంగా మూడోసారి ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షుడు ఓబ్లాపూర్ లకా్ష్మరెడ్డి, ప్రదాన కార్యదర్శి శివరామరాజు, అనుబంధ కమిటీ అధ్యక్ష, కార్య దర్శులు, కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే పార్టీ కండువాలతో సత్కరించారు.
కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మాజీ విండో అధ్యక్షుడు నారాయణరెడ్డి, మాజీ జడ్పీటీసీ అరవింద్ కుమార్, విజయసింహారెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రహామాన్, నాసీర్ఖాన్, కల్వాల్షమి పాల్గొన్నారు.