నర్వ: గ్రామాలలో ఉండే రైతులను కూలీల స్థానం నుంచి యజమానుల స్థాయికి చేర్చి వారిని రాజును చేయడమే తెరాసా ప్రభుత్వ ధ్వేయమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం జడ్పీ చైర్మన్ వనజాగౌడ్తో కలిసి పాతర్చేడ్, నర్వలో రైతు వేదికలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం మండలంలోని ప్రతి చెరువును ప్రాజెక్టుల ద్వారా నింపి, సాగునీటి సౌకర్యానికి ఇరవై నాలుగు గంటల కరెంట్తోపాటు పెట్టుబడికి రైతుబంధు సాయం, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందజేస్తున్నదన్నారు.
ప్రతి గ్రామానికి వ్యవసాయ విస్తరణాధికారిని అందుబాటులో ఉంచి తగిన మెలుకువలు, యాజమాన్య నైపుణ్యాలను తెలియజేస్తున్నామన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టు బాటు ధరను కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంద న్నారు. మండలంలో గత పంట కాలంలో రికార్డు స్థాయిలో 3లక్షల 84 క్వింటాళ్ల ధాన్యం సేకరించామని, జిల్లాలో నర్వ మండలమే ప్రథమ స్థానంలో ఉందన్నారు.
అనంతరం జిల్లా వ్యవసాయాధికారి జాన్ సుధాకర్ మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితం నర్వ మండలం నుంచే మొదలైం దని, అప్పటికీ, ప్రస్తుత కాలానికి వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. జడ్పీ చైర్మన్ వనజ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను రైతులు సద్వినియోగ పరుచుకొని ఆర్థికంగా అబివృద్ధి సాధించాలని అకాంక్షించారు.
అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మాత్స్య కార్మికులకు 10070 వేల చేప పిల్లలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములుశెట్టి, వైస్ఎంపీపీ వీణవతి, సింగిల్ విండో చైర్మన్ లక్ష్మీకాంత్రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, ఎంపీడీవో రమేశ్కుమార్, ఏవో గణేశ్రెడ్డి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.