జెడ్పీ సీఈవో జ్యోతి
జడ్చర్లటౌన్, ఏప్రిల్ 10 : కొవిడ్ వ్యాక్సినేషన్పై ప్రజలకు అవగాహన కల్పించాలని జెడ్పీ సీఈవో జ్యోతి సూచించారు. శనివారం జడ్చర్ల అర్బన్ హెల్త్సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా హెల్త్ సెంటర్లో కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. 45ఏండ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యసిబ్బందికి సూ చించారు. కాగా, అర్బన్ హెల్త్సెంటర్లో కొవిడ్ వ్యాక్సినేషన్ దృష్ట్యా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుం డా పాత తాసిల్దార్ కార్యాలయంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ శివకాంత్ తెలిపారు.
పోలేపల్లి సెజ్లో పరీక్షలు
జడ్చర్ల పట్టణంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలేపల్లి సెజ్లోని హెటిరో ఫార్మా కంపెనీలో ఉద్యోగులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. జడ్చర్ల అర్బన్ హెల్త్సెంటర్, గంగాపురం పీహెచ్సీ ఆధ్వర్యంలో మొత్తం 70మంది ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ శివకాంత్ తెలిపారు. కార్యక్రమంలో డీఎంవో విజయకుమార్, డాక్టర్లు సమత, సునీల్, హెటిర్ సంస్థ ప్రతినిధి చంద్రారెడ్డి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.