నారాయణపేట టౌన్, ఏప్రిల్ 27: కరోనా వ్యాప్తి కారణంగా పట్టణంలో హనుమాన్ జయంతి వేడుకలను ప్రజలు నిరాడంబరంగా భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. పట్టణంలో సాయివిజయ కాలనీలోని తోట్ల హనుమాన్ మందిర్, శాంతినగర్ హనుమాన్ ఆలయం, సింగార్భేస్లోని మూలహనుమాన్ ఆలయం, పళ్లలోని హనుమాన్ ఆలయం, అశోక్నగర్, బాపునగర్లోని అభయాంజనేయస్వామి ఆలయాల్లో అర్చకులు స్వామి వారికి ఆకులపూజ, సింధూ లేపనం, చందన లేపనం తదితర ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ గావించారు. పలు ఆలయాల్లో స్వామి వారికి డోలారోహణం చేశారు. అశోక్నగర్లోని అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద భక్తులకు కొవిడ్ నిబంధనలు అనుసరించి అన్నదానం చేశారు. సాయి విజయ్కాలనీలోని తోట్ల హనుమాన్ మందిర్లో ఆర్డీవో వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
మక్తల్లో..
మక్తల్ టౌన్, ఏప్రిల్ 27 : హనమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి స్వామి వారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు శ్రీనివాస్గుప్తా పాల్గొన్నారు.
రాజాపూర్లో..
రాజాపూర్, ఏప్రిల్ 27: మండల కేంద్రంలో మంగళవారం శ్రీరామదూత హనుమన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమన్ దేవాలయానికి భక్తులు భారీగా చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రామకృష్ణ, నర్సింహులు, ప్రశాంత్, బుగ్గయ్య, శేఖర్, బాలరాజు, రాజు, సూరి పాల్గొన్నారు.
మిడ్జిల్లో..
మిడ్జిల్, ఏప్రిల్ 27: మండల కేంద్రంతో పాటు వాడ్యాల్, బోయిన్పల్లి, వేముల, దోనూర్ తదితర గ్రామాల్లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో హనుమాన్ సేనా నాయకులు హరిగౌడ్, బాలు, రమేశ్, అరవింద్, రాజు, మల్లేశ్, ప్రశాంత్, శేఖర్ పాల్గొన్నారు.
బాలానగర్లో..
బాలానగర్, ఏప్రిల్ 27: మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. పూజల్లో పురోహితుడు శ్రీనివాస్శర్మ, భక్తులు శ్రీనువాసులు, రాములు, మహేందర్ తదితరులున్నారు
ఊట్కూర్లో..
ఊట్కూర్, ఏప్రిల్ 27 : హనుమజ్జయంతి ఉత్సవ వేడుకలను మండల వ్యాప్తంగా భక్తులు మంగళవారం ఘనంగా జరుపుకొన్నారు. ఊట్కూర్, బిజ్వారం పెద్దజట్రం, తిప్రాస్పల్లి, ఓబ్లాపూర్, పగిడిమర్రి గ్రామాల్లో హనుమాన్ ఆలయాలను రంగులు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఆయా గ్రామాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను దర్శించుకుని హనుమంతుడికి అభిషేకం, ఆకుల పూజ, మహా మంగళహారతి, అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దజట్రం హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ధ్వజ స్తంభం ప్రతిష్టించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కిరణ్కుమార్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నారాయణపేటలో..
నారాయణపేట రూరల్, ఏప్రిల్ 27 : మండలంలోని జాజాపూర్, చిన్నజట్రం, అంత్వార్ గ్రామాల్లో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకొన్నారు. జాజాపూర్ కొత్త కాలనీలోని ఆలయంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కోట్ల జగన్మోహన్రెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అలాగే జెట్టి హనుమాన్ ఆలయంలో హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఆలయాల వద్ద కొవిడ్ నింబధనలు పాటిస్తూ చిన్నారులకు తులాబారం చేశారు.
కోయిలకొండలో..
కోయిలకొండ, ఏప్రిల్ 27: మండల కేంద్రంతోపాటు నల్లవెల్లి, చింతల్తండా, కోయిలకొండలో హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించారు. కోయిలకొండలో ఆదిఆంజనేయస్వామికి 516 తమలపాకులతో ప్రత్యేక అలంకరణ, సత్యనారాయణ స్వామి వ్రత పూజలను నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు కృష్ణయ్య, ఆంజనేయులు, రఘు , ఎంపీటీసీ ఆంజనేయులు పాల్గొన్నారు.
నవాబ్పేటలో..
నవాబ్పేట,ఏప్రిల్ 27: మండల కేంద్రంతో పాటు కొండా పూర్, పోమాల, కొల్లూరు, మరికల్ గ్రామాల్లో ప్రజలు హనుమాన్ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొ న్నారు. గ్రామాల్లో యువకులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.
ధన్వాడలో..
ధన్వాడ, ఏప్రిల్ 27: ధన్వాడతోపాటుగా వివిధ గ్రామా ల్లో మంగళవారం హన్మన్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. కోటపక్కా వీధిలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఆకుల పూజ నిర్వహించి అన్నదానం చేపట్టారు. అదేవిధంగా బురుజుగడ్డ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కందూర్ శ్రీనివాస్రెడ్డి తోపాటు పలువురు పాల్గొన్నారు.