కరోనా బాధితులు ధైరంగా ఉండాలి
కొవిడ్ వారియర్స్ సేవలు అభినందనీయం
మంత్రి నిరంజన్రెడ్డి
గద్వాల దవాఖానలోకొవిడ్ వార్డు పరిశీలన
గద్వాల, మే 24 : కరోనా బాధితులకు మనోధైర్యమే అసలైన మందు అని.. అందరిలో మనోనిబ్బరం పెంచాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్రెడ్డి, అబ్రహాంతో కలిసి జిల్లా దవాఖానలోని కొవిడ్ వార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా కరోనా బాధితులకు అందిస్తున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మం త్రి మాట్లాడారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్య త మనందరిపై ఉందన్నారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. కరోనా బాధితులు ఎట్టి పరిస్థితిలోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ మాస్కు ధరించి భౌతికదూరం పాటించాలని సూచించారు. ప్రభుత్వం జ్వర స ర్వే చేపట్టడం, లాక్డౌన్ విధించడంవల్ల ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు.
కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్యు లు, సిబ్బందితోపాటు పోలీసులు బాధ్యతగా పని చేసి మానవత్వం చాటుకుంటున్నారని, వారందరికీ ఈ సమాజం రుణప డి ఉందని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మంత్రి పాల్గొని కరోనా బాధితులకు అన్నదానం చేశారు. అంతకుముం దు దవాఖానలో సీసీ కెమెరాలను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రఘురాంశర్మ, ఆర్డీవో రాము లు, డీఎంహెచ్వో చందునాయక్, మున్సిపల్ చైర్మన్ కేశవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్, ఎంపీపీ విజయ్కుమార్, జెడ్పీటీసీ రాజశేఖర్, కౌన్సిలర్ నాగిరెడ్డి పాల్గొన్నారు.