లాక్డౌన్లో బయట తిరిగేవారిపై చర్యలు తీసుకోవాలి
కలెక్టర్ హరిచందన
మక్తల్ టౌన్, మే 24 : లాక్డౌన్ సమయంలో ప్రజలు కరోనా బారిన పడకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ హరిచందన అధికారులకు సూచించారు. సోమవారం పట్టణంలో లాక్డౌన్ అమలు తీరును కలెక్టర్ ఎస్పీ చేతనతో కలిసి పరిశీలించి పోలీసు, రెవెన్యూ అధికారులతో మాట్లా డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం పది గంటల నుంచి లాక్డౌన్ అమలు విధానం మరింత పటిష్టంగా ఉంటుందని, రోడ్డుపై ఎవరూ తిరుగవద్దని అధికారులకు సూచించారు. లాక్డౌన్ అమలు విధానం వల్ల కరోనా వ్యాప్తి తగ్గుతుందన్నారు. అదేవిధంగా ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించే విధంగా అధికారులు చూడాలన్నారు. రోడ్లపై తిరిగే వాహనాలను సీజ్ చేయాలన్నారు. అదేవిధంగా జ్వర సర్వే గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ చేతన మాట్లాడుతూ పోలీసులు లాక్డౌన్ సమయంలో కఠినంగా వ్యవహరించి బందోబస్తు నిర్వహించాలన్నారు. పట్టణంలో 25 వాహనాలను సీజ్ చేశామని ఎస్సై రాములు ఎస్పీకి తెలిపారు. కార్యక్రమంలో తాసిల్దార్ నర్సింగ్ రావు, ఎస్సై రాములు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
విజయ కాటన్ ఇండస్ట్రీని పరిశీలించిన కలెక్టర్
ఊట్కూర్, మే 24 : జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యం వర్షానికి తడిసిపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేపడుతున్నామని కలెక్టర్ హరిచందన అన్నారు. సోమవారం అధికారులతో కలిసి ఊట్కూర్ శివారులోని విజయ కాటన్ ఇండస్ట్రీని పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ రైతులెవరూ ఆందోళన చెందవద్దని, కాస్త ఆలస్యమైనా పండించిన ప్రతి గింజ నూ ప్రభుత్వం కొనుగోలు చే స్తుందని భరోసా ఇచ్చారు. తుఫాన్ ప్రభావంతో రైతులు పంట కల్లాల వద్ద నిలువ చేసుకున్న ధాన్యం బస్తాలు వర్షానికి తడిసి పోకూడదనే ఉద్దేశంతో ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పంట పొలాల వద్ద ఉన్న ధాన్యం బస్తాలను ఇండస్ట్రీలో భద్ర పరుచుకోవాలని సూచించారు. రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన బస్తాలను వెంటనే మిల్లర్ల వద్దకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, తాసిల్దార్ తిరుపతయ్య, ఏవో గణేశ్రెడ్డి, పీఏసీసీఎస్ సెక్రటరీ హుసేన్, విద్యాసాగర్ పాల్గొన్నారు.