నారాయణపేట, మే 22 : జాతీయ స్థాయి ఆశ కార్యకర్తలు ఈ నెల 24న నిర్వహించనున్న సమ్మెను విజయంవంతం చేయాలని ఆశ యూ నియన్ నాయకులు అంజమ్మ, నర్సమ్మ పేర్కొన్నారు. శనివారం మండ లంలోని కోడకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ యూనియన్ ఆధ్వర్యంలో డాక్టర్ మల్లికార్జున్కు వినతిపత్రం అందజేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కట్టడిలో ఆశ కార్యకర్తలు ముందు నిలిచి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆశ కార్యకర్తలకు మాస్కులు, గ్లౌజ్లు తదితర రక్షణ కవచాలు ఇవ్వాలని కోరారు. సమ్మెకు ఆశ కార్యక ర్తలు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.