సంక్షోభ పరిస్థితుల్లోనూ సంక్షేమం
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
రూ. 4.20కోట్లతో ఎస్టీ గురుకుల భవన నిర్మాణానికి శంకుస్థాపన
జడ్చర్లటౌన్, జూన్ 20 : రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధితోపాటు విద్యా,వైద్యరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చెప్పారు. జడ్చర్ల మండలంలోని కోడుగల్ గ్రామంలో రూ.4.20 కోట్ల నిధులతో మంజూరైన గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల నూతన భవన నిర్మాణ పనులకు ఆదివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు కల్పించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. ఏడేండ్లలో వందలాది గురుకుల పాఠశాలలను నెలకొల్పి కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పా రు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు కొత్త భవనాలు, ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్న ట్లు తెలిపారు. భావితరాలు బాగుపడ్తాయన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ విద్యారంగంపై దృష్టిసారించారన్నారు. రైతులకు రైతుబంధు, రైతుబీమాతోపాటు వ్యవసాయానికి 24 గంటలపాటు విద్యుత్తును అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు ఉనికి కోసం అనవసర విమర్శలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో సంగీత,నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, బాదేపల్లి మార్కెట్కమిటీ చైర్మన్ కాట్రపల్లి ల క్ష్మయ్య, కోడుగల్, లింగంపేట సర్పంచులు మమత, హైమావతి, టీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్రెడ్డి, రఘుపతిరెడ్డి, ఇం తియాజ్ఖాన్, రాంచందర్, శ్రీను, రమేశ్ పాల్గొన్నారు.