ఎల్లూరు వద్ద మోటార్ల మరమ్మతుకు నెల రోజులు పట్టే అవకాశం
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మిషన్ భగీరథ అధికారుల సమీక్ష
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోడల్ రైతు బజార్ సందర్శన
మహబూబ్నగర్, మే 20 : నాగర్కర్నూల్ జిల్లాలోని ఎల్లురూ వద్ద ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ మోటార్ల మరమ్మతులు పూర్తయ్యేందుకు నెల రోజుల సమయం పడుతుందని, అప్పటి వరకు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంద ని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కోయిల్సాగర్ నుం చి మహబూబ్నగర్ పట్టణానికి తాగు నీరందించే పథకం ఇన్టేక్ వెల్ మోటార్లను ముందే తనిఖీ చేసుకోవాలని పబ్లిక్ హెల్త్ ఈఈ విజయభాస్కరరెడ్డిని ఆదేశించారు. వాటర్ పైప్లైన్ ప్రస్తుత పరిస్థితి, లీకేజీలు సరిచేసుకోవాలని మంత్రి ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రామయ్యబౌళి వద్ద మోడల్ రైతు బజార్ను మంత్రి పరిశీలించారు. రైతులతోపాటు దుకాణాల యజమానులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్క్ తప్పనిసరి ధరించాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కమిషనర్ ప్రదీప్కుమార్ ఉన్నారు.
నాగేందర్యాదవ్ మృతి తీరని లోటు
మహబూబ్నగర్ నివాసులైన జీహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా విధులు నిర్వహించిన నాగేందర్యాదవ్ అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరమని ఆయన లోటు తీరనిదని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం బాధిత కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడి వారిని ఓదార్చారు.
నిబంధనలు పాటిస్తే కరోనాను నియంత్రించొచ్చు
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 20: కరోనా నియంత్రణకు ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను ప్రజలు తప్పకుండా పాటిస్తే కరోనాను నియంత్రించవచ్చని మం త్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలో లాక్డౌన్ సడలింపు సమయంలో గురువారం ఆ యా ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించారు. క్లాక్టవర్ సమీపంలోని మందుల దుకాణాలను తనిఖీ చేశారు. ఎవరూ అనవసరంగా బయట తిరగొద్దన్నారు.
క్రీడాభివృద్ధికి కృషి
మహబూబ్నగర్టౌన్, మే 20: రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో రాష్ట్ర హాకీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు గురువారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సన్మానించి అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ హకీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటికే స్టేడియం ఆధునీకరణ పనులు చేపడుతున్నామని, త్వరలోనే ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర హాకీ అసోసియేషన్ చైర్మన్ లయన్ కొండవిజయ్కుమార్, కార్యదర్శి ముకేశ్కుమార్, కోశాధికారి భాస్కర్రెడ్డి, ఉపాధ్యక్షుడు కాశీజీ, పాలమూరు హాకీ ప్రధాన కార్యదర్శి గోటూర్ శ్రీనివాసులుగౌడ్, వనపర్తి కార్యదర్శి బొల్లమోనికుమార్, కోశాధికారి మన్నెంయాదవ్, పేట టీఎస్ అధ్యక్షుడు జగన్మోహన్గౌడ్, కార్యదర్శి రామేశ్వరయ్య పాల్గొన్నారు.