నారాయణపేట, మే 18 : కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్పీ చేతన హెచ్చరించా రు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధం గా బయట తిరిగే వారిపై కఠినంగా వ్యవహరించాలని, వాహనాలను ఆపి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. వాహనాల తనిఖీ నిర్వహించడంతోపాటు, గుర్తింపు కార్డులు, ఇతర పత్రాలు పరిశీలించాలన్నారు. జిల్లాలో లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు నిబంధనలు అతిక్రమించిన 905 మందిపై కేసులు నమోదు చేసి, ఏడు వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రజలు బాధ్యతతో వ్యవహరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. మెడికల్ షాపులు, కిరాణ షాపులు, బట్టల షాపులు, హోటళ్లు, దవాఖానల వద్ద మూడు అడుగుల దూరంలో గుర్తులు వే యించాలన్నారు. కూరగాయల మార్కెట్లో ప్రజల తాకిడి ఎక్కువగా ఉన్నందున స్థానిక మున్సిపల్ అధికారులతో మాట్లాడి వేరే ఓపెన్ ప్లే స్లో అదనంగా మార్కెట్లు ఏర్పాటు చేసే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు.