దామరగిద్ద మే 18 : కాలం గడుస్తున్నకొద్దీ మనం రో జూ వాడే వస్తువులకు కాలం చెల్లుతుంది, సేవలు కూడా కనుమరుగైపోతాయి. అలాంటి వాటిలో రేడియోలు, టెలిఫోన్లు, బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఇలా చాలా వస్తువులు, సే వలు ఆగిపోయాయి. 30 సంవత్సరాల కిందట రేడియోలపై బాగా మోజు ఉండేది, క్రికెట్ కామెంట్రీ వినాలన్నా, వార్తలు వినాలన్నా, రైతులకు సంబంధించిన సమాచారాలకు పాడిపంట లాంటి సేవలకోసం చాలామేరకు రేడియో పై ఆధార పడేవారు, అప్పట్లో రేడియో కొనాలన్నా చాలా మందికి వీలయ్యేది కాదు. గ్రామాల్లో అయితే గ్రామ పం చాయతీ కార్యాలయంలో ఒక రేడియో దానికి ఒక పొంగ(స్పీకర్) ఉండేవి, ఉదయం, సాయంత్రం రెండు సమయా ల్లో వార్తలు వినడానికి అనుకూలంగా ఉండేది, దాన్ని అక్క డ పనిచేసే కారోబార్ ఆపరేట్ చేసేవారు. 1985 తరువాత బ్లాక్ అండ్ వైట్ టీవీలు రావడంతో మాట వినడంతోపా టు బొమ్మ కూడా చూడడం చాలా బాగా అనిపించేది అప్ప ట్లో, రానురాను టీవీపై మోజు పెరిగి రేడియోకు చాలా వర కు ఆదరణ, వాడకం రెండూ తగ్గుముఖం పట్టడంతో రేడి యో కనుమరుగైపోయింది.
ఇంకా కొన్ని రోజులకు కలర్ టీవీలు, ప్లాస్మా టీవీలు రావడంతో బ్లాక్ అండ్ వైట్ టీవీలు మరమ్మతులు చేయడానికి మెకానిక్లు లభించపోవడంతో ఆ టీవీలు కాస్తా క నుమరుగై పోయాయి. 1988లో మండంలోని పలు గ్రా మాలకు టెలిఫోన్ సౌకర్యం వచ్చింది. మనం ఎవరి దగ్గరై నా మాట్లాడాలి అంటే పోస్టాఫీసుకు వెళ్లి ట్రంక్ కాల్ బుక్ చేసి గంటల తరబడి కూర్చొని మాట్లాడి వచ్చేవారు. సేవ లు కూడా మారి ఎస్టీడీ సౌకర్యం రావడంతో ఆ సెంటర్ కు వెళ్లి మనకు కావాల్సిన వారి దగ్గర మనదేశంతోపాటు ఇతర దేశాలకు కూడా మాట్లాడే అవకాశం ఉండేది. అది కూడా కొద్ది రోజులకు మార్కెట్లో సెల్యులార్ ఫోన్ రావడంతో ల్యాండ్లైన్ ఫోన్లు అంటే టెలిఫోన్ల సేవలు తగ్గుము ఖం పట్టాయి. అంతే త్వరగా స్మార్ట్ ఫోన్ సేవలు అందుబాటులోకి రావడంతో ల్యాండ్ ఫోన్లు, ఎస్టీడీ బూత్లు తదితర సేవలన్నీ కనిపించకుండా మాయమైపోయాయి.
ఇంకా పోస్టల్ సేవలు కూడా దాదాపు అంతరించి పోయే సమయానికి వచ్చినట్లే, ఒకప్పుడు బంధువులతో, స్నేహితులతో సంప్రదింపులన్నీ ఉత్తరాలపై ఆధారపడి ఉండేవి, ఈ ఉత్తర, ప్ర త్యుత్తరాల ద్వారా చాలా సమయం పడుతుండేది, కానీ ప్రస్తుతం కొరియర్ సర్వీసులు ఈ రోజు ఉత్తరం వే శామంటే రెండు రోజుల్లో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తుంది, దీంతో పోస్టల్ సేవలు కచ్చితంగా పో స్టులో పంపించాలి అనే వాటికి మా త్రమే వాడుతున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే మనం వాడే చాలా వ స్తువులు చాలా కనుమరుగైపోయా యి. ఒకప్పుడు ఏ పనికైనా రోజులు, నెలలు పట్టే సమయానికి ఇప్పుడు డిజిటల్ సేవలు అందుబాటులోకి రావడం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల చొరవ, ఆస క్తి చూపడంతో ఒక్క క్లిక్తో పనులన్నీ సెకన్లలో జరిగిపోతున్నాయి. ఆఖరికి మనం ఎవరికైనా డబ్బులు పంపించాల న్నా కూడా ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్లతో సెకన్ల లో డబ్బులు పంపించొచ్చు. రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని సేవలు, ఎలాంటి సేవలు వస్తాయో.