కొత్త వారికి నుమతి లేదు
ఊరి బయట చెక్పోస్ట్..
షిఫ్టుల వారీగా నలుగురు కాపలా
60 శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి
చద్దన్నం, రాగి, జొన్న సంకటే ఆహారం
కరోనా దరిచేరని ఎర్రపెంట గ్రామం..
లింగాల, మే 17 : కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఒక్క పాజిటివ్ కేసు నమో దు కాకుండా సంతోషంగా జీవనం సాగిస్తున్నారు చెంచు గిరిజనులు. అటవీ ఉత్పత్తులను నమ్ముకొని.. అప్రమత్తతతో నివారణ చర్యలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపూర్ పంచాయతీలోని ఎర్రపెంట గ్రామంలో కరోనా దరి చేరలేదు. గతేడాది మార్చిలో మొదలైన మొదటి దశ కరోనా వైరస్ను చెంచు గిరిజనులు నిరక్షరాస్యులైనా నిబంధనలు పాటించారు. జీవనోపాధి కోసం కుటుంబాలతో కలిసి అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లి వారాల తరబడి అక్కడే ఉండి కాలం వెల్లదీస్తున్నారు. అటవీ ఉత్పత్తులకు వెళ్లని వారు ఇండ్లకే పరిమితమవుతున్నారు. ఇతర ప్రాంతాలకు రాకపోకలు తగ్గించి పెంటలోనే కిరాణా దుకాణం ఏ ర్పాటు చేయించి నిత్యావసర సరుకులు అ మ్ముతున్నారు. లాక్డౌన్లో స్వచ్ఛంద సంస్థ లు ఇచ్చిన సరుకులతోనే సరిపెట్టుకున్నారు.
కరోనా కట్టడికి చర్యలు..
నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీరంగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రపెంట గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నది. పెంట లో దాదాపు 162 కుటుంబాలు, 262 మంది జనాభా ఉన్నారు. పెంట గ్రామం ముఖద్వారంలో చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని గ్రామంలోకి అనుమతించడం లేదు. కర్రలతో చెక్పో స్టు వద్ద నలుగురు వ్యక్తులు షిప్టుల వారీగా కాపలా ఉంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని గ్రామంలోకి అ నుమతించకుండా.. ఎవరి కోసం వచ్చా రో ఆ వ్యక్తులను పిలిచి చెక్పోస్టు వద్దే మాట్లాడి వెనక్కి పంపిస్తున్నారు. కరోనా మొదటి వేవ్ నుంచి అప్రమత్తంగా ఉంటూ వైరస్ దరి చేరకుం డా చర్యలు తీసుకుంటున్నారు.