దేవరకద్ర రూరల్, మే 17 : కరోనా సోకిందని ఎవరూ అధైర్యపడొద్దని, బాధితులకు అండగా ఉంటామని సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శివరాజు అన్నారు. మండలంలోని ఇస్రంపల్లి గ్రామంలో కరోనా బాధితులకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పంపించిన డ్రైఫ్రూట్స్ ప్యాకెట్లను సోమవారం పంచాయతీ కార్యదర్శి సింధుతో కలిసి పంపిణీ చేశా రు. కరోనా బాధితులు భయపడకుండా వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు. ఎవరికైనా తీవ్ర అనారోగ్య సమస్య ఏర్పడితే ఎమ్మెల్యే సహకారంతో మెరుగైన చికిత్స అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
బాధితులకు అండగా ఉంటాం
కొవిడ్ బాధితులకు అండగా ఉండి సహాయ సహకారాలు అందజేస్తానని టీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్రెడ్డి అన్నారు. మండలంలోని డోకూర్లో పలువురికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైరస్ సో కిన వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, లాక్డౌన్లో ఏదైనా అత్యవసరం ఉన్నా పరిష్కరిస్తామని తెలిపారు. బాధితులకు ప్రతిరోజూ పోషక విలువలతో కూడిన భోజనం, గుడ్డు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.
భోజనం ప్యాకెట్లు పంపిణీ
మహబూబ్నగర్, మే 17 : లాక్డౌన్ నేపథ్యంలో పరశురామ బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం జిల్లా కేంద్రంలో భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. రోడ్లపై ఉన్న అనాథలు, వృద్ధు లు, దవాఖానల్లో ఉన్నవారికి భోజనం ప్యాకె ట్లు, తాగునీటిని అందజేశారు. ప్రతిరోజూ 200 భోజనం ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు ఏర్పా ట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు వాయుప్రదీప్, సంజీవ, జో షి సంతోష్, హన్మేశ్, జయతీర్థ, ఓంకార్, గౌత మ్, వెంకు పాల్గొన్నారు.