నారాయణపేట, ఏప్రిల్ 17 : పోలీస్ స్టేషన్ల్లో స్టేషన్ రైటర్లు వృత్తిపై విధేయ త, క్రమశిక్షణ, నిబద్ధత కలిగి ఉండాలని స్టేషన్ రైటర్స్ వర్టికల్ ఇన్చార్జి శంకర్ అ న్నారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల్లో విధు లు నిర్వహిస్తున్న స్టేషన్ రైటర్స్కు శనివా రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక రోజు శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ స్టేషన్ రైటర్లు పోలీ స్ స్టేషన్ స్థాయిలో పోలీస్ వ్యవస్థ సమర్థవంతంగా పని చేయడంలో కీలక పాత్ర వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల్లో 5 ఎస్ వి ధానం అమలులో స్టేషన్ రైటర్స్ ముఖ్య పాత్ర పో షించాలన్నారు. ఉన్నతాధికారుల సూచనల మేర కు సిబ్బందిని సమన్వయం చేస్తూ విధులను కేటాయించాలని, కేసుల దర్యాప్తు సరైన రీతిలో జరుగుటంలో సహకరించాలన్నారు. రికార్డ్స్, ఫైల్స్, సర్క్యులర్లు నిర్దేశిత ప్రదేశంలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎస్హెచ్వోల ఆదేశాల మేరకు బందోబస్తు స్కీములు, డ్యూటీ పాస్పోర్టు లు తయారు చేయాలని సూచించారు. అవసరమై న సమాచారాలు, నివేదికలు సకాలంలో సంబంధిత అధికారులకు పంపించాలన్నారు. ఈ వీడి యో కాన్ఫరెన్స్లో స్టేషన్ రైటర్లు పాల్గొన్నారు.