కృష్ణ, జూన్ 15 : మండలంలోని గుడెబల్లూర్లో మంగళవారం మారెమ్మదేవి, పోలమ్మతల్లికి ఘనంగా ప్రత్యేక పూ జలు నిర్వహించారు. గ్రామస్తులంతా కలిసి కృష్ణానది నుం చి జలాలు తెచ్చి గ్రామ దేవతలకు అభిషేకం చేశారు. సా యంకాలం మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పంచి నైవేద్యాలు పెట్టారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిసి పం టలు బాగా పండాలని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఘనంగా పోలేరమ్మ జాతర
ఊట్కూర్, జూన్ 15 : మండలంలోని నిడుగుర్తిలో గ్రా మ దేవత పోలేరమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. పోలేరమ్మ ఆలయానికి భక్తులు బోనాలు ఎత్తుకుని మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లారు. పలువురు భ క్తులు గ్రామ దేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులంతా ఇంటిల్లిపాదితో సు ఖంగా, పాడి పంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ పూ జించారు. కార్యక్రమంలో సర్పంచ్ యుశోదమ్మ, ఎంపీటీసీ రాఘవరెడ్డి, మాజీ సర్పంచులు విజయభాస్కర్రెడ్డి, నారాయణరెడ్డి, కృష్ణార్జున్రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
మారెమ్మ ఉత్సవాలు
మక్తల్ టౌన్, జూన్ 15 : మక్తల్లో ఘనంగా మారెమ్మ జాతర నిర్వహించారు. కొవిడ్ నిబంధనలకు అనుసరించి భక్తులు పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి పట్టణంలోని రాయచూర్ రోడ్డులో ఉన్న మారెమ్మ దేవాలయానికి వచ్చి భక్తు లు పూజలు నిర్వహించారు. ప్రతి ఇం టిలోని ఆడపడుచులు బోనాలతో పూ జలు నిర్వహించారు. మారెమ్మ ఆలయానికి వచ్చి వారి కోరికలు నెరవేర్చిన అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి ఆలయం చుట్టూ భక్తులు తిరుగుతూ కోరిన కోరికలు నెరవేర్చాలని పూజలు నిర్వహించారు.
పోచమ్మ బోనాలు
నారాయణపేట రూరల్, జూన్ 15 : పేట మండలంలోని సింగారం, జాజాపూర్ తదితర గ్రామాల్లో పోచ మ్మ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ఉదయం స్థానిక బీరప్ప ఆలయాల నుంచి పెద్ద బోనంతోపాటు బోనం కుం డలను భజనలు, మేళ తాళాలతో ఊరేగిస్తూ పోచమ్మకు నైవేద్యాన్ని సమర్పించి భక్తులు మొక్కులను చెల్లించుకున్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో అమ్మవారి జాతర
నారాయణపేట టౌన్, జూన్ 15 : పట్టణంలోని పరిమళపురంలో వెలసిన పోచమ్మ అమ్మవారి జాతరను పట్టణ ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించి భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. పలు వార్డుల నుంచి మహిళలు బోనాలతో ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు. ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అమ్మవా రి ఆలయం వద్ద భక్తులు మేకలు, కోళ్లు కోసి, కల్లు, మజ్జిగ, అన్నం, పచ్చిపులుసుతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.