కోస్గి, జూన్15 : జాతీయ ఉపాధిహామీ పథకంలో జరుగుతున్న పనుల్లో మండలంలో భారీగా అవకతవకలు చో టు చేసుకుంటున్నాయి. ముశ్రీఫా గ్రామంలో 1051 ఉపాధి హామీ జాబ్ కార్డులున్నాయి. అందులో పనికి వచ్చేవారి సంఖ్య సగమైతే పనికి రాకుండానే హాజరు వేయించుకునేవారు సగమున్నారు. ఉపాధి పనికి రాకున్నాసరే కాస్త పలుకుబడి ఉంటే చాలు మీరు పనికి రాకున్నా హాజరు వేయాలంటే ఒక్కసారి పంచాయతీ కార్యదర్శిని కలిసి అతడిని సంతోషపరిస్తే చాలు వారి హాజరు నిత్యం పడుతూనే ఉం టుంది. అందరిలాగే పనికి వచ్చినవారితోపాటు రానివారి ఖాతాల్లో సైతం డబ్బులు పడుతున్నాయి. ఇదేమిటని ఎవరైనా నిలదీస్తే కార్యదర్శి తనదైన శైలిలో కూలీలను బెదిరిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామంలో చేసిన పనికి కూలీలసంఖ్యకు పొంతనలేకుండా పోయింది. ఈ విషయమై గ్రామ యువకులు వివరాలు తీసుకొని సోషల్మీడియాలో వీడియోలు తయారుచేసి చక్కర్లు కొట్టిస్తున్నారు. ఈ విషయమై స్పందించాల్సిన ఉన్నతాధికారులు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు, ఆరోపణలకు తావిస్తున్నది.
ఇదిలా ఉండగా గ్రామంలో ఉపాధిహామీ పనికి సంబంధించిన హాజరు కార్యదర్శి కొండయ్య వేయకుండా అఫ్రోజ్ అనే ఓ వ్యక్తిని తనకు అసిస్టెంట్గా పెట్టుకొని అతనిచే హాజ ర్లు వేయిస్తున్నాడు. ఇదేమిటని గ్రామస్తులు అడిగితే తాను సమయానికి రాలేకపోయినా అతనే హాజర్లు వేస్తాడని బదులిస్తున్నాడు. ఒక్క గ్రామపంచాయతీలోనే ఇంత తతంగముంటే మండలంలోని మిగిలిన 25 గ్రామపంచాయతీల్లో ఇంకెంత అవినీతి జరుగుతుందోనని కూలీలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదే విషయమై మండల ఏపీవో మా ధవరెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అతడు అం దుబాటులోకి రాలేదు.