నారాయణపేట, మే 15 : లాక్డౌన్ సమయంలో కొంతమంది అవసరం లేకున్నా బయటకు వస్తున్నారని అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేస్తామని ఎస్పీ చేతన అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని, లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే డబుల్ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించడంతో తమ పనులు చేసుకోవాలన్నారు. లాక్డౌన్ సమయంలో మెడికల్ ఎమర్జెన్సీ, ఇతర అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటకు రావాలని, విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి సహకరించాలని కోరారు. అత్యవసర పనుల నిమిత్తం బ యటకు వెళ్లే వారికి ఇప్పటి వరకు 187 పాసులు ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 188 ఐపీసీ, కింద ఈ పెట్టి కేసులు నమోదు చేస్తామన్నారు.