పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
అధికారుల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
కోస్గి, జూన్ 14: మున్సిపాలిటీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తికావాలని మండలంలోని ఆయా గ్రా మాల్లో జరుగుతున్న సీసీరోడ్లు, డ్రైనేజీ ప నులు వెంటనే పూర్తిచేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం ఏబీకే ఫంక్షన్హాల్లో కోస్గి, మద్దూర్ మం డలాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలో కొనసాగుతున్న డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం, డంపింగ్యార్డు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే ఆ యా వార్డుల్లో కౌన్సిలర్లు సూచించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలిపారు. పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న పార్కు పనులను వేగవంతం చేయాలన్నారు. ప లు కాలనీల్లో లో ఓల్టేజీ సమస్య పరిష్కరించాలని, విద్యుత్పోల్స్ ఎక్కడ అవసరమున్నా వెంటనే పోల్స్ వేయించాలని వి ద్యుత్ అధికారులను ఆదేశించారు.
జిల్లా అధికారులతో మాట్లాడి అవసరమైన పో ల్స్ను తాను ఇప్పిస్తానన్నారు. వర్షాలు ప్రా రంభమయ్యే సరికి డ్రైనేజీ పనులు పూర్తిచేయాలన్నారు. ఏ కాంట్రాక్టర్ పనుల్లో నిర్ల క్ష్యం చేసినా కాంట్రాక్టర్ను మార్చాలని అ ధికారులకు సూచించారు. గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టి కి తీసుకురాగా ఏఈలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఎంబీలు తయారుచేసి రికార్డులు పంపాలని వెంటనే బిల్లులు వచ్చేలా చూడాలన్నారు. అనంతరం పట్టణంలోని 16వ వార్డుతోపాటు పలు వార్డుల్లో సరిప డా పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంత రం 61మందికి సీఎం సహాయనిధి చెక్కులను అందించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, ఎంపీపీ మధుకర్రావు, కౌన్సిలర్లు మాస్టర్ శ్రీనివాస్, బాలేశ్, జనార్దన్రెడ్డి లక్ష్మమ్మ, గోవర్ధన్రెడ్డి, భానూనాయక్, ఇద్రిస్ నాయకులు రాజేశ్, హరితోపాటు ఆయాశాఖల అధికారులు తదిత రులు పాల్గొన్నారు.
భూమిపూజ చేసిన స్థలాన్నే కేటాయించాలి
గతంలో కోస్గి జర్నలిస్టుల కోసం పట్టణంలోని 1856 సర్వేనెంబర్లో ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, భూమిపూజ చేసి జర్నలిస్టుకాలనీ చేయాలని ఆదేశించిన స్థ లాన్ని తమకు కేటాయించాలని సోమవా రం జర్నలిస్టులు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని కోరారు. ప్రస్తుతం ఈ స్థలంలో మున్సిపల్ అధికారులు పార్క్ ఏర్పాటుకు పనులు చేపట్టారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే స్పందించి ఈ సర్వేనెంబర్లో ఎకరా ముప్పై ఏడు గుంటల భూ మి ఉందని, ముప్పై ఏడుగుంటల్లో పార్కు ఏర్పాటు చేసి ఎకరా స్థలం జర్నలిస్టులకు అందిస్తామన్నారు. ఈ భూమిని సర్వేచేసి హద్దులు నిర్ణయించాలని తాసిల్దార్ రాం కోటిని కోరారు. అనంతరం ఇదే విషయా న్ని కలెక్టర్ హరిచందనతో ఎమ్మెల్యే ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ స్థలాన్ని జర్నలిస్టులకు అందిస్తానని హమీ ఇచ్చారు.