లాక్డౌన్కు సహకరిస్తున్న వ్యాపారులు, ప్రజలు
నిర్మానుష్యంగా రహదారులుదుకాణాలు బంద్ చేశారు. దీంతో
అచ్చంపేట, మే 14: అచ్చంపేట ప్రాంతంలో లాక్డౌన్ మూడో రోజూ విజయవంతమైంది. ప్రజలు ఉదయం 6 నుంచి 10గంటల వరకు మాత్రమే నిత్యావసరాల కోసం బయటకు వచ్చి తర్వాత ఇండ్లకే పరిమితమయ్యారు. పది గంటలు దాటిన తర్వాత వ్యాపారస్తులు స్వచ్ఛందంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. లాక్డౌన్ సమయంలో అత్యవసరపనుల కోసం వెళ్తున్న వారినే పోలీసులు అనుమతిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని తిప్పి పంపుతున్నారు.
నిబంధనలు పాటించాలి
ఉప్పునుంతల, మే 14: కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ శుక్రవారం కూడా కొనసాగింది. ఉప్పునుంతలలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి బయటకు వస్తున్నారు. మిగతా సమయంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. లాక్డౌన్ను ఎస్సై రమేశ్ సమీక్షిస్తున్నారు. కొవిడ్ నిబంధనలను అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తున్నారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దని సూచించారు.
కొనసాగుతున్న లాక్డౌన్
అమ్రాబాద్, మే 14: అమ్రాబాద్, పదర మండలాల్లో శుక్రవారం లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 6 నుంచి 10గంటల వరకు ప్రజలు రోడ్లపైకి వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేశారు. పది గంటల నుంచి దుకాణాలు బంద్ చేయడంతో రహదారులన్నీ బోసిపోయాయి. ఈ సందర్బంగా ఈగలపెంట ఎస్సై పోచయ్య, సురేశ్ గ్రామాల్లో రోడ్లపైకి ఎవరూ రాకుండా చర్యలు చేపట్టారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా తిరుగుతూ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిబ్బంది కళ్యాణ్, రాంబాబు, మోజెస్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
లాక్డౌన్ను పర్యవేక్షించిన ఎస్పీ
నాగర్కర్నూల్, మే 12: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో మూడోరోజూ బంద్ కొనసాగింది. మధ్యాహ్నం సమయంలో ఎస్పీ సాయిశేఖర్ ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టారు. మూడు రోజులుగా కొనసాగుతున్న లాక్డౌన్
అమలును ఆయన పరిశీలించారు. అనవసరంగా బయటకు వస్తున్న వాహనదారులను నిలిపి ప్రశ్నించారు. సరదాకు బయటకు వస్తే సహించేది లేదని, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉదయం నుంచి 10 గంటల వరకు బస్సు సర్వీసులు కొనసాగాయి. కూరగాయల మార్కెట్లో రోజుమాదిరిగానే రద్దీ కనిపించింది. ఉదయం వెసులుబాటు సమయంలో ఇతర అవసరాల నిమిత్తం పట్టణానికి వచ్చిన వివిధ గ్రామాల ప్రజలతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. అనవసరంగా బయటకు వస్తున్న వాహనదారులకు జరిమానా విధించారు.
నిర్మానుష్యంగా రహదారులు
బిజినేపల్లి, మే 14: మండలంలోని ఆయా గ్రామాల్లోని రోడ్లు శుక్రవారం నిర్మానుష్యంగా మారాయి. లాక్డౌన్ కారణంగా ఉదయం 6 నుంచి 10గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచుతున్నారు. ఎస్సై వెంకటేశ్ ఆధ్వర్యంలో లాక్డౌన్ ఉల్లంఘించిన 50మందికి జరిమానా వేశారు. అనంతరం దుకాణదారులను హెచ్చరించారు. దుకాణాలు తెరిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కొనసాగుతున్న లాక్డౌన్
తెలకపల్లి, మే 14: మండలంలో శుక్రవారం సంపూర్ణంగా లాక్డౌన్ కొనసాగింది. నెహ్రూచౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు లాక్డౌన్ సడలింపు సమయంలో జనం గుంపుగుంపులుగా ఉంటున్నారు. ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ ప్రారంభం కావడంతో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూయడంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని ఎస్సై మాధవరెడ్డి సమీక్షిస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
వంగూరు, మే 14: కరోనా నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్సై బాలకృష్ణ హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై వంగూరు గేటు వద్ద ఎస్సై ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. మూడు బైక్లను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. మాస్కులు ధరించని ముగ్గురికి రూ.1000 చొప్పున జరిమానా విధించడంతోపాటు ఉల్పర, సర్వారెడ్డిపల్లి, తిరుమలగిరి గ్రామాల్లో లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు తెరిచిన వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. లాక్డౌన్ సందర్భంగా అత్యవసరమైతే తప్పా బయటికి రావొద్దన్నారు.