భూత్పూర్, జూన్ 9 : కల్తీ విత్తనాలకు చోటు లేకుండా నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని రాష్ట్ర కమిషనరేట్ ఏడీఏ సుధాకర్బాబు అన్నారు. మండలంలోని పత్తి విత్తన కంపెనీలలో, డీలర్ల దుకాణాల్లో బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వసంత్ సీడ్స్, సుదివ్య, సాయిభవ్య, శ్రీవెంకటేశ్వర్రెడ్డి, ఆద్య ప్రాసెసింగ్ యూనిట్లలో, బీటీహెచ్ఆర్, సుచరిత, దుకాణాల్లో ఉన్న పత్తి విత్తనాలకు సంబంధించిన రికార్డులను, స్టాక్ను పరిశీలించారు. అనంతరం హెచ్టీ(కలుపు నివారణ) పరీక్షలను నిర్వహించారు. కార్యక్రమంలో సీడ్ సర్టిఫికెట్ అధికారి లావణ్య, ఏడీఏ యశ్వంత్రావు, ఏవోలు గోపీనాథ్, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట, జూన్ 9 : అడ్డాకుల మండలంలోని పత్తి విత్తనాల దుకాణాల్లో రాష్ట్ర టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో ఉన్న పత్తి విత్తనాలను, స్టాక్ రిజిస్టర్లను బుధవారం పరిశీలించారు. రైతులు నష్టపోకూడదనే ప్రభుత్వం తనిఖీలను నిర్వహిస్తుందని ఏడీఏ యశ్వంత్రావు తెలిపారు. హెచ్టీ(కలుపు నివారణ) పరీక్షలను నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనరేట్ ఏడీఏ సుధాకర్బాబు, ఏడీఏ యశ్వంత్రావు, సీడ్ సర్టిఫికెట్ అధికారి లావణ్య, ఏవోలు శ్రీనివాసులు, గోపినాథ్ పాల్గొన్నారు.