గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ
ఊట్కూర్, జూన్ 9 : జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాలను జిల్లా ఎమ్మెల్యేల సహకారంతో అభివృద్ధి పథంలోకి తెస్తామని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శాసం రామకృష్ణ అన్నారు. బుధవారం ఊట్కూర్, మక్తల్, మాగనూర్ మండల కేంద్రాల్లోని గ్రంథాలయాలను ఉమ్మడి జిల్లా సెక్రటరీ మనోజ్కుమార్తో కలిసి సందర్శించారు. ఆయా గ్రంథాలయాల్లో ఫర్నిచర్, పుస్తక సామగ్రిని పరిశీలించారు. పాఠకులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలు ఆలయాలతో సమానమన్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి సహకారంతో సమస్యలను సీఎం కేసీఆర్కు దృష్టికి తీసుకువెళ్తానని, గ్రంథాలయాలలో పూర్తి స్థాయి సిబ్బంది నియామకంతో పాటు భవనాలకు కొత్త హంగులను సమకూరుస్తామని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ చంద్రశేఖర్రెడ్డి, జీపీ కారోబార్ నారాయణ పాల్గొన్నారు.