మరికల్, మే 8 : కొన్నేండ్లుగా ఉన్న రహదారిని ఆంధ్రాకు చెందిన శ్రీసాయి ధరణి స్పంజ్ ఆండ్ ఐరన్ కంపెనీ వారు అక్రమించుకోవడం తగదని సర్పంచ్ అరుంధతిరఘునాథ్రెడ్డి, ఎంపీటీసీ దేవెందర్రెడ్డి ఆన్నారు. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ చిత్తనూర్ నుంచి ఏక్లాస్ పూర్ వరకు 3.5 కిలోమీటర్ల రహదారి ఉందని ఈ రహదారి ప్రభుత్వ నక్ష ప్రకారం ఉన్న ప్రైవేట్ కంపెనీ వారు గ్రామస్త్తులకు తెలియకుండా కంచె ఏర్పాటు చేస్తుంటే గ్రామస్తులు అడ్డుకున్నారని తెలిపారు. గ్రామానికి ఉన్న రహదారిని ఎలా ఆక్రమించుకుంటారని వారు ప్రశ్నించారు. ఆక్రమించుకున్న రహదారిని వెంటనే విడిచి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. గ్రామస్తులంతా కలిసి రహదారి కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు. కంపెనీ యజమానికి సోమవారం వరకు సమయం ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆక్రమించిన రహదారి వదిలి వారి భూమికి కంచె ఏర్పాటు చేసుకుంటే ఎవరికీ అ భ్యంతరం లేదని గ్రామస్త్తులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు రఘు నాథ్రెడ్డి, అంజిల్రెడ్డి, బాల్రెడ్డి, రామకృష్ణారెడ్డి, నర్సిములు, జగన్, రమేశ్, రాములు, హన్మిరెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు.