నారాయణపేట, మే 8 : పట్టణంలో శనివారం ఫీవర్ సర్వే కొనసాగింది. ఆయా వార్డులలో అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు ఇంటింటికీ తిరిగి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. జ్వరం, దగ్గుతోపాటు కరోనా లక్షణాలు ఉన్న వారికి కిట్లు అందజేశారు. 2వ వార్డులో నిర్వహించిన ఫీవర్ సర్వేలో మున్సిపల్ సిబ్బంది సంతోషి, అంగన్వాడీ టీచర్లు గీత, రాధిక, ఆశ వర్కర్లు శివమ్మ, లక్ష్మి పాల్గొనగా, టీఆర్ఎస్ నాయకులు జొన్నల సుభాష్ పరిశీలించారు.
చిత్తనూర్లో సర్వే ప్రారంభం
మరికల్, మే 8 : మండలంలోని చిత్తనూర్ గ్రామంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇంటింటి ఫీవర్ సర్వేను ప్రారంభించారు. ప్రతి ఇంటికీ తిరిగి ఇంట్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేశ్ తెలిపారు. గ్రామంలో ఆంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు సర్వే కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. గ్రామంలో అనారోగ్యంగా ఉన్న వారిని గుర్తించి తగు సూచనటు ఇవ్వడంతో పాటు, మందులు ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆంగన్వాడీ టీచర్లు పద్మ, గాయత్రి, ఆశ కార్యకర్తలు పద్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.
కోస్గిలో..
కోస్గి మే 8 : ప్రభుత్వ ఆదేశాలమేరకు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ఆశ కార్యకర్తలు అంగన్వాడీ, మున్సిపల్ సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. శనివారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునస్వామి ఆధ్వర్యంలో అన్నివార్డుల్లో సర్వే నిర్వహించారు. ప్రతి ఇంట్లో సభ్యుల వివరాలు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. జ్వరం, జలుబువంటి లక్షణాలుంటే వారికి మందులు అందిస్తున్నారు. అదేవిధంగా మండలంలోని ఆయా గ్రామాల్లో సైతం ఈ సర్వే కొనసాగుతోంది. కార్యక్రమంలో కౌన్సిలర్లు బాలేశ్, మాస్టర్ శ్రీనివాస్, నాయకులు రాజేశ్, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
తిప్రాస్పల్లిలో..
ఊట్కూర్, మే 8 : కరోనా లక్షణాలు తీవ్రమైతే వెంటనే దవాఖానకు వెళ్లాలని సర్పంచ్ సుమంగళి అన్నారు. ఇంటింటికీ జ్వర సర్వేలో భాగంగా శనివారం తిప్రాస్పల్లిలో నిర్వహిస్తున్న సర్వేను ఆమె పరిశీలించారు. కరోనా లక్షణాలతో ఉన్న వారు సర్వే టీంకు తమ వివరాలను తెలియజేయాలని సూచించారు. పాజిటివ్ వచ్చిన వారు ఆందోళన చెందొద్దని వైద్యుల సూచనమేరకు ఐసొలే షన్లో ఉండాలన్నారు. ఊట్కూర్, పెద్దజట్రం, కొత్తపల్లి, పులిమామిడి, మల్లే పల్లి, చిన్నపొర్ల, పెద్దపొర్ల గ్రామాల్లో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు ఉమ్మడిగా సర్వే చేపట్టారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.