నక్కలబండ తండాను సందర్శించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల, జూన్ 6: రోడ్డు విస్తరణలో పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇల్లు లేదా ఇంటినిర్మాణాలకు స్థలాలను కేటాయిస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని నక్కలబండ తండాను ఆదివారం ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన తండావాసులతో ఎమ్మెల్యే మాట్లాడారు. రోడ్డు విస్తరణతో దారిలేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఈ విషయమై అనూష కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ను పిలిచి పనులు త్వరగా పూర్తిచేసి తండావాసులకు రోడ్డు అనుసంధానం చేస్తూ సబ్వే ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, కౌన్సిలర్ చైతన్య, రవీందర్, తదితరులు ఉన్నారు.