దేవరకద్ర రూరల్, జూన్ 2 : ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం దవాఖాన ల అభివృద్ధికి కృషి చేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో రూ.18లక్షలతో నూతనంగా ఐసీయూ భవన నిర్మాణానికి బుధవారం అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి ఎమ్మెల్యే భూమిపూజ చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మం డల ప్రజలే కాకుండా ఇతర మండలాల ప్రజలు వస్తుంటారని, ఇక్కడ అన్ని వసతులతోకూడిన వైద్యసేవలు అందించడానికి ఐసీయూ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ సౌకర్యంకూడిన ఐసీయూను అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో కృష్ణ, తాసిల్దార్ జ్యోతి, మండల వైద్యాధికారిణి షబానాబేగం, ఎంపీపీ రమాదేవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్యాదవ్, నాయకులు కొండా శ్రీనివాస్రెడ్డి, వెంకట్రాములు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
కళాకారులకు సన్మానం
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్ ఇంట్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కళాకారులను ఘనంగా సన్మానించారు. మేథరి నారాయణ, చెన్నకేశవులును శాలువా, పూలమాలలతో సన్మానించి కొంత నగదును అందజేశారు. కార్యక్రమంలో మురళీధర్గౌ డ్, సత్యనారాయణ, అశోక్, బోరింగ్ నర్సింహులు, గడ్డం రాములు, సదానంద్గౌడ్, అప్సర్ తదితరులు పాల్గొన్నారు.