నారాయణపేట, జూన్ 2 : టీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా పరిస్థితుల కారణంగా రాష్ట్ర అవతరణ వేడుకలను నిరాడంబరంగా జరుపుకొంటున్నట్లు చెప్పారు. కరోనా పరిస్థితుల కారణంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథ కం ఆలస్యమవుతుందని, రానున్న రెండేళ్లలో పూర్తి చేసుకుంటామని తెలియజేశారు.
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ పార్టీ
పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. వివిధ కారణాలతో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. జ్యోతిర్నాథ్కు రూ. 4లక్షలు, నారాయణమ్మకు రూ. 29వేలు, చెన్నప్పకు రూ. 20వేల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ గందె అనసూ య, పీఏసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, పట్టణ అ ధ్యక్షుడు కోట్ల రాజవర్ధన్రెడ్డి, కౌన్సిలర్లు అని త, రాజేశ్వరి, గురులింగం, సీనియర్ నాయకులు గందె చంద్రకాంత్, సుదర్శన్రెడ్డి, సుభాష్తోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.