స్ట్రాంగ్ రూంలో బ్యాలెట్ బాక్సులు భద్రం
ఓటింగ్ నమోదుపై లెక్కలేసుకుంటున్న అభ్యర్థులు
జడ్చర్ల టౌన్, మే 1 : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ముగిసిన నేపథ్యంలో జడ్చర్లలో అన్ని వార్డుల్లో ఓ టింగ్ నమోదు విషయంపై చర్చలు మొదలయ్యాయి. వార్డు ల వారీగా అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు ఓటింగ్ నమోదుపై లెక్క లేసుకుంటున్నారు. మున్సిపాలిటీలో ఏ పా ర్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో అని చర్చించుకుంటున్నారు. జ డ్చర్ల బల్దియా పరిధిలో మొత్తం 27 వార్డులు ఉండగా మొ త్తం 41,761 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 27,813 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేసిన వారి లో 14,236 మంది పురుషులు, 13577 మంది మహిళలు ఉన్నారు. దీంతో 66.60 శా తం పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీలో 2వ వార్డులో అత్యధికంగా 82.08 శాతం పోలింగ్ నమోదవగా.. అత్యల్పంగా 15వ వార్డులో 52. 59 శాతం నమోదైంది. ఈ నే పథ్యంలో వార్డుల్లో పోటీ చేసి న అభ్యర్థులు తమకు ఏ మేర కు ఓట్లు వచ్చాయో అని లెక్కలేసుకుంటున్నారు. జరిగిన ఓటింగ్ సరళి మేరకు అన్ని స్థా నాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని గు లాబీ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వా ర్డుల రీగా ఓటింగ్ నమోదు విషయాల గురించి వివరాలు సేకరిస్తున్నారు. 3న వెలువడనున్న ఫలితాలపై అందరూ దృ ష్టి సారించారు. మరోవైపు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో బ్యాలెట్ బాక్సులను పోలీ సు పహారా మధ్య భద్రపరిచారు.