నారాయణపేట, జూన్ 22 : పట్టణంలోని పళ్లవీధిలో వెలిసిన పోచమ్మ దేవత ఉత్సవాన్ని మంగళవా రం ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో అర్చకులు అమ్మవారికి పసుపు, కుంకుమ, పుష్పార్చన, మహామంగళ హారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వివిధ వార్డుల నుంచి మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అన్నం, ఉల్లిగడ్డ, కల్లు, భక్ష్యాలతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలను చల్లంగా చూడాలని, కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించమని వేడుకున్నారు. అదేవిధంగా అశోక్నగర్లో ఉన్న గజలేశ్వరీదేవి ఉత్సవాలను పట్టణ ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యే క పూజలు నిర్వహించగా, భక్తులు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.