భూత్పూర్ రిజర్వాయర్లో 4.7లక్షల రొయ్య పిల్లలు విడదల చేసిన ఎమ్మెల్యే
మక్తల్ రూరల్: రాష్ట్రంలో మత్స్యకారులకు ప్రభుత్వం చేయూతనిస్తున్నదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని భూత్పూర్ రిజర్వాయర్లో 4లక్షల 70వేల రొయ్య పిల్లలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మత్స్యసంపద గణనీయంగా పెరిగిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నామని ఫలితంగా మత్స్య కార్మికులు ప్రాజెక్టులలో చేపలను పెంచుకోవడానికి ప్రభుత్వం మత్స్య పారిశ్రామిక సహాకార సంఘాల ద్వారా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో సంగం బండ పెద్ద వాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి, భూత్పూర్ రిజర్వాయ ర్లలో రొయ్యల పెంపకం కోసం ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగిందన్నారు.
ఈ ప్రాంతంలో మత్స్య కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటానని ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గత ఏడా ది సంగం బండ రిజర్వాయర్లో 5లక్షల రొయ్యలు, 10లక్షల చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ సారి 20లక్షల చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిందన్నారు. మక్తల్, మాగనూరల్ మండలాల్లోని గ్రామాల్లో మత్స్య కార్మికులకు ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయన్నారు.
అయితే స్థానిక మత్స్యకారులు మధ్య దళారులను అశ్రయిస్తున్నారని, దీనివల్ల అర్హులైన మత్స్యకారులకు నష్టం వాటిల్లు తుందని ఆయన విచారం వ్య క్తం చేశారు. దళారుల ప్రమేయం లేకుండా స్వంతంగా మార్కెటింగ్ చేసుకోవడానికి ముందు కు వస్తే తప్పకుండా మక్తల్లో చేపల మార్కెట్ను ఏర్పాటు చేయడానికి శాయశక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మక్తల్ మార్కెట్ చైర్మన్ రాజేశ్గౌడ్, భూత్పూర్ సర్పంచ్ హన్మంతు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, భూత్పూర్ మత్య్స సంఘం అధ్యక్షుడు శేఖర్, కార్మికులు పాల్గొన్నారు.