మక్తల్ రూరల్: మక్తల్ పట్టణంలోని పురాతన వేణుగోపాల స్వామి ఆలయ పునరుద్దరణ పనులను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన వేణుగోపాల స్వామి దేవాలయం శిథిలావస్థకు చేరడంతో ఇటీవల ఆలయ కమిటీ పునరుద్దరణ పనులను చేపట్టింది. కాగా ఈ పనులకు ఎమ్మెల్యే రూ. పది లక్షలను విరాళగా ప్రకటించారు.
ఈ మేరకు ఆలయంలో జరుగుతున్న పనులను ఆయన దివారం స్వయంగా పరిశీలించారు. పనులు ఎలా జరుగుతు న్నాయి? ఆలయ గర్భగుడి నిర్మాణం పనులు ఆగమన శాస్త్రం ప్రకారం చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రాజేశ్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్గుప్తా, మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ నరసింహాగౌడ్, ఆలయ కమిటీ నాయకులు శ్రీహరి, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.