మక్తల్ రూరల్: మక్తల్ పట్టణంలో గురువారం స్థానిక ఎమ్మెల్యే నివాసంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, పలువురు సర్పంచ్లు , జడ్పీటీసీలు, ఎంపీటీసీలు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనాన్ని 30శాతం పెంచడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గుప్తా, మక్తల్ మార్కెట్ చైర్మన్ రాజేశ్గౌడ్, మాగనూర్ జడ్పీటీసీ సభ్యుడు వెంకటయ్య, నేరడిగొమ్ము సర్పంచ్ అశోక్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, పట్టణాధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కావలి తాయప్ప తదితరులు పాల్గొన్నారు.