ఊట్కూర్: అన్నదాతను ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో రైతు ఆగ్రో సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హజరై ప్రారంభించారు.
అనంతరం రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులను సరఫ రా చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆగ్రో రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. వ్యసాయానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, పంటలకు 24 గంటల పాటు విద్యుత్, పెట్టుబడి సాయం, రైతు భీమా తదితర సదుపాయాలతో రైతు లకు దన్నుగా నిలిచిందన్నారు.
ఆగ్రో సేవా కేంద్రం నిర్వహకులు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బాల్ రెడ్డి, ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, రైతు బంధుసమితి అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ గోవిందప్ప పాల్గొన్నారు.