యాదవుల ఆరాధ్యుడు సీఎం కేసీఆర్
మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్
సీఎం కేసీఆర్, మంత్రులు నిరంజన్రెడ్డి, తలసాని చిత్రపటాలకు క్షీరాభిషేకం
వనపర్తి, జూలై 21: రాష్ట్రంలో అన్నివర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, గొర్రెల పెంపకదారుల సహకార యూనియన్ జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్ పేర్కొన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీకి రూ.6వేల కోట్లు ఇచ్చిన సీఎం కేసీఆర్, అందుకు కృషిచేసిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్ చిత్రపటాలకు గొర్రెల పెంపకదారుల సహకార యూనియన్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఇప్పటికే మొదటి విడుతలో రూ.5వేల కోట్లతో గొర్రెల పంపిణీ చేపట్టగా అద్భుత ఫలితాలు ఇచ్చిందని, రెండో విడుత గొర్రెల పంపిణీ చేయడం హర్షణీయమని, జిల్లా యాదవుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో సంఘం డైరెక్టర్ బీచుపల్లి యాదవ్, చంద్రయ్యయాదవ్, కౌన్సిలర్లు చీర్ల సత్యం సాగర్, నాగన్నయాదవ్, రాములుయాదవ్, నాయకులు గోపాల్యాదవ్, శేఖర్యాదవ్, గోపాల్యాదవ్, బాలస్వామియాదవ్, తిరుపతయ్యయాదవ్, మహేశ్యాదవ్, శ్రీనివాసులుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
గోపాల్పేట మండలంలో..
గోపాల్పేట, జూలై 21: గొల్ల కురువల అభివృద్ధికి ప్రభుత్వం రెండో విడుత గొర్రెల పంపిణీకి ఆమోదం తెలుపడంతో మండలంలోని గొల్ల కురువలు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, ఉపాధ్యక్షుడు చంద్రయ్యయాదవ్, డైరెక్టర్ పరశురాంయాదవ్, గ్రామ అధ్యక్షుడు పుల్లయ్యయాదవ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు తిరుపతియాదవ్, సర్పంచ్ శ్రీనివాసులు, నాయకులు కాశీనాథ్, కోటీశ్వర్రెడ్డి, శ్రావణ్, లక్ష్మయ్య, నాగశేషి తదితరులు పాల్గొన్నారు.
పాన్గల్ మండలంలో..
పాన్గల్, జూలై 21: రెండో విడుత గొర్రెల పంపిణీకి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయడంతో మండలంలోని గొర్రెల కాపరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో గొర్రెల కాపరుల సంఘం నాయకులు సీఎం కేసీఆర్, మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, నిరంజన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, సర్పంచ్ బాలస్వామి, టీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్నాయక్, సర్పంచ్ గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెద్దమందడి మండలంలో..
పెద్దమందడి, జూలై 21: కురుమ యాదవుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ రెండో విడుత గొర్రెల పంపిణీకి రూ.6వేల కోట్లు కేటాయించడంపై బుధవారం మండల కేంద్రంలోని గాంధీజీ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్, మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, నిరంజన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ కుమార్యాదవ్, అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, గొర్రెల కాపరుల సంఘం మండల అధ్యక్షుడు నాగేంద్రంయాదవ్, సత్యారెడ్డి, కుమార్యాదవ్, పుల్లన్న, బాలయ్య, కృష్ణయ్య, రాజు, రాములు, యాదవులు తదితరులు పాల్గొన్నారు.
పెబ్బేరు మండలంలో..
పెబ్బేరు, జూలై 21: యాదవుల ఆరాధ్యుడు సీఎం కేసీఆర్ అని మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల కర్రెస్వామియాదవ్ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రులు నిరంజన్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘం జిల్లా డైరెక్టర్ రాజశేఖర్యాదవ్, టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు మేకల ఎల్లయ్యయాదవ్, గోపాల్యాదవ్, బాలకృష్ణయాదవ్, ఎల్లస్వామియాదవ్, ఆంజియాదవ్, కృష్ణయ్యయాదవ్, నారాయణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తకోటలో..
కొత్తకోట, జూలై 21: రాష్ట్రంలో యాదవ కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీకి ఆమోదించడంతో యాదవులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం స్థానిక టీఆర్ఎస్, యాదవ సంఘం నాయకులు కొత్తకోటచౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రులు నిరంజన్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బీసం జయమ్మ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాములుయాదవ్, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, సాక బాలనారాయణ, మిషేక్, శ్రీనివాస్జీ, సత్యంయాదవ్, ఎల్ఐసీ కృష్ణయ్య, శంకర్యాదవ్, సుభాష్, సింధూజ, వెంకటేశ్, హన్మంతుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.