న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్ యశ్పాల్ శర్మ మృతి ఇవాళ మృతిచెందిన విషయం తెలిసిందే. 1983 క్రికెట్ వరల్డ్కప్లో ఆడిన యశ్పాల్.. ఇవాళ ఉదయం గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. యశ్పాల్ మృతి బాధాకరం అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలిపారు. 83 వరల్డ్ కప్లో అతని ప్రదర్శన అసాధారణమన్నారు. యశ్పాల్ కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
యశ్పాల్ మృతి పట్ల మాజీ క్రికెటర్లు సంతాపం తెలిపారు. యశ్పాల్ మృతి ఎంతో షాక్కు గురి చేసిందని సచిన్ టెండూల్కర్ తెలిపారు. 1983 వరల్డ్కప్లో అతని బ్యాటింగ్ శైలిని చూసి ఎంజాయ్ చేసేవాడినన్నారు. ఎన్నో జ్ఞాపకాలు మిగిలి ఉన్నాయన్నారు. భారతీయ క్రికెట్కు ఆయన అందించిన భాగస్వామ్యం మరవలేనిదని సచిన్ తెలిపారు. శర్మ కుటుంబానికి నివాళి అర్పించారు.
కేంద్ర క్రీడాశాక మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా నివాళి అర్పించారు. వరల్డ్ కప్ విన్నింగ్ సభ్యుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. అతని కెరీర్ అద్భుతంగా సాగిందన్నారు. 83 వరల్డ్కప్లో రెండవ అత్యధిక స్కోరర్ అతనే అని తెలిపారు. అంపైర్గా, సెలెక్టర్గా ఆయన చేసిన సేవలు మరిచిపోలేమని మంత్రి తన ట్వీట్లో తెలిపారు.
వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, వెంకటేశ్ ప్రసాద్, అనిల్ కుంబ్లే, శిఖర్ ధావన్.. ఇంకా అనేక మంది క్రికెటర్లు యశ్పాల్ మృతి పట్ల నివాళి అర్పించారు.