ప్రభుత్వ విప్ బాల్క సుమన్
దళిత సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతాభినందన సభ
హాజరైన ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్ పర్సన్..
మంచిర్యాల, జూలై 1, నమస్తే తెలంగాణ/ రామకృష్ణాపూర్:దళితుల ఆర్థిక స్వావలంబన కోసమే సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకం ప్రవేశపెట్టారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఇందుకు గాను మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పరిధిలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో గల అమ్మా గార్డెన్లో గురువారం జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞతాభినందన సభ నిర్వహించారు. విప్ మాట్లాడుతూ దళితుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని, తాజాగా రూ.10 లక్షలు అందిస్తామని ప్రకటించడం అభినందనీయమన్నారు.
ఆర్థిక స్వావ లంబన కోసమే దళిత సాధికారత పథకం అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. దళిత సాధికారత పథకం ప్రవేశ పెట్టిన సీఎం కేసీఆర్కు జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మాగార్డెన్లో గురువారం కృతజ్ఞాతాభినందన సభ నిర్వహించారు. ఈ సభకు విప్తో పాటు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, గాయకుడు సాయిచంద్తో పాటు 15 సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. వీరిని దళిత సంఘాల నేతలు ఘనంగా సన్మానించా రు. ఈ సందర్భంగా విప్ సుమన్ మాట్లాడుతూ.. ఏడేండ్ల కేసీఆర్ పాలనలో దళిత సాధికారత కోసం అమలు చేసిన పథకాలు, ఆర్థిక అభివృద్ధి, విద్యాభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. ఏడేండ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం రూ.55,500 కోట్ల పైచిలుకు ఖర్చు పెట్టిందన్నారు. కల్యాణ లక్ష్మికి ఇప్పటి వరకు రూ.14,800 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 870 ఉన్నాయని తెలిపారు. హాస్టల్స్లో ఉండి చదువుకొనే విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనాలు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు మెస్ చార్జీలు తెలంగాణ ప్రభుత్వమే పెంచి ఇస్తున్నదని తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్నవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నదన్నారు.
దళితుల అభివృద్ధి కోసం రుణాలు, ఉన్నత విద్యావంతులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామని, గురుకుల పాఠశాలలో ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.1.25 లక్ష ఖర్చు చేస్తున్నదని, గత ప్రభుత్వాలు రూ.20 వేలు మాత్రమే ఇచ్చేవని తెలిపారు. దళితులకు సామాజిక రక్షణ, సామాజిక భద్రత, సామాజిక స్వావలంబన కోసం అఖిల పక్ష సమావేశం నిర్వహించి దళిత సాధికారత పథకం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షలు వేస్తామని చెప్పడం అభినందనీయమని తెలిపారు. దళితులపై అరాచకం సాగించే పోలీసులపై చర్యలకు సీఎం నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామన్నారు. దళితులపై ఉన్న ప్రేమతోనే కేసీఆర్ కుటుంబం లో సన్నిహితంగా మెదిలే అవకాశం తనకు దక్కిందని బాల్క సుమన్ గుర్తుచేశారు. వారి అడుగులో అడుగేసి నడవడమే ఆయనకు తెలిపే కృతజ్ఞతాభివందనాలు అని ఉద్ఘాటించారు. ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ మాట్లాడుతూ.. దళిత జాతి నీతి, నిజాయతీ కలిగిన జాతి అని ప్రశంసించారు. ఓటు అనే వజ్రాయుధం ద్వారా కేసీఆర్ రుణం తీర్చుకోవచ్చని హితవుపలికారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. దీంతోనే దళితులు అన్ని రంగాల్లో ఎదుగుతున్నారని, రాజకీయ నాయకులుగా కూడా ఉన్నారని గుర్తు చేశారు.
దళితులకు బీమా రక్షణ, రూ.10 లక్షలు ఇస్తున్న రాష్ట్రం దేశంలో మనది తప్పా.. ఒక్కటి కూడా లేదన్నారు. బీజేపీ దళితులకు అనుకూలమా? వ్యతిరేకమా? దళితులు ఆలోచించుకోవాలని కోరారు. ఎంపీ వెంకటేశ్ నేతకాని మాట్లాడుతూ.. దళితుల పాలిట ఆధునిక అంబేద్కర్ కేసీఆర్ అని అభివర్ణించారు. దళితుల భావితరాల భవిష్యత్ కోసం ఆత్మవిశ్వాసంతో రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అడగకుండానే రూ.10 లక్షలు దళిత కుటుంబాలకు అందిస్తామని తెలపడం సంతోషంగా ఉందన్నారు. దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్ కృతజ్ఞతాభినందనలు తెలిపారు. అనంతరం అంబే ద్కర్ పాటకు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని స్టెప్పులేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణుకుంట్ల ప్రవీణ్, మందమర్రి జడ్పీటీసీ వేల్పుల రవి, క్యాతనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ విద్యాసాగర్రెడ్డి, నాయకులు సాయి చంద ర్, వెంకటేశ్వర్లు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.