ఓ వ్యక్తిని దెయ్యాలు వేధిస్తున్నాయట.. ఆ దెయ్యాల ముఠాలోని రెండు దెయ్యాలు అయితే విపరీతంగా భయపెడుతున్నాయట.. ఏకంగా చంపేస్తామని బెదిరిస్తున్నాయట.. ఇక ఆ దెయ్యాల వేధింపులు భరించలేక అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గుజరాత్లోని పంచమహల్ జిల్లా జామ్బూగోడా తాలుకాకు చెందిన బరియా(35) అనే వ్యక్తి తన పంట పొలానికి వెళ్లగా.. అక్కడ తనను దెయ్యాలు వేధిస్తున్నాయని, రెండు దెయ్యాలు మాత్రం చంపేస్తాయని బెదిరిస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బరియా మాటలను విన్న పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ ఘటనపై బరియా కుటుంబ సభ్యులను ఆరా తీయగా అతని మానసిక పరిస్థితి సరిగా లేదని తెలిపారు.
గత ఏడాది కాలం నుంచి సైక్రియాటిస్ట్ వద్ద అతను చికిత్స పొందుతున్నాడు. అయితే గత పది రోజుల నుంచి ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవడం లేదు అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే బరియా ఈ ఒత్తిడి నుంచి విముక్తి పొందాలనే ఉద్దేశంతో కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. అతన్ని చికిత్స నిమిత్తం సైక్రియాటిస్ట్ వద్దకు పంపామని తెలిపారు.