హైదరాబాద్ : కోస్టారికా అంబాసిడర్ క్లాడియో అన్సోరెనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ణు శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్రం వ్యవసాయ, ఐటీ, ఫార్మా, పారిశ్రామిక రంగంలో గణనీయమైన పురోగతి సాధించిందని వివరించారు. గత 7 సంవత్సరాలుగా వ్యవసాయరంగంలో సాధించిన ప్రగతి, కాళేశ్వరం నీటి పారుదల ప్రాజెక్టు, కోవిడ్ నియంత్రణకు చేపట్టిన చర్యలను వివరించారు.
ఆయిల్ ఫామ్ సాగు, సాంకేతిక సహకారం, వ్యవసాయం తదితర రంగాలలో పరస్పర సహకారంతో పాటు, పామాయిల్ పరిశ్రమల పెట్టుబడులకు గల విస్తృత అవకాశాలపై చర్చించారు. ఎంవోయూ కుదుర్చుకొనే అంశాలపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, జాయింట్ సెక్రటరి ( ప్రొటోకాల్) అర్విందర్ సింగ్ లు పాల్గొన్నారు.