తూప్రాన్ రూరల్, జూన్ 24: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ 2018 ఆగస్టు 15న సీఎం కేసీఆర్ ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి హరీశ్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ కలిసి గ్రామంలోని పలు వీధుల్లో కలియతిరుగుతూ వీధులు, రోడ్లకు ఇరువైపులా, ఇంటి పరిసరాల్లో గ్రామస్తులు నాటిన మొక్కలను చూసి సీఎం మంత్రముగ్ధులయ్యారు. సమష్టిగా మొక్కలు నాటి సంరక్షిస్తున్నందుకు గ్రామస్తులను అప్పట్లో సీఎం అభినందించారు. అనంతరం గ్రామ శివారులో నిర్మించిన రాక్ సీఎం కేసీఆర్ బాదం, కొబ్బరి మొక్కను నాటి వాటికి ఎరువులు వేసి నీటిని పోశారు. గ్రామంలోని పలు ఇండ్ల పరిసరాల్లో వివిధ రకాల మొక్కలను నాటారు.
సీఎం కేసీఆర్ అబ్బురపరిచిన మల్కాపూర్..
రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామమైన మల్కాపూర్ నాటిన హరితహారం మొక్కలు ఏపుగా పెరిగి గ్రామం పచ్చదనంతో కళకళలాడుతున్నది. గ్రామంలో ఎక్కడ చూసినా నాటిన వృక్షాలతో పచ్చదనం నెలకొన్నది. రోడ్లు, వీధులకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, ఖాళీ ప్రదేశాలు, ఇంటి పరిసరాలు హరితహారం మొక్కలతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరితహారం ఆరు విడతల్లో గ్రామంలో 5.86 లక్షల మొక్కలు నాటి సంరక్షిస్తుండడంతో ఏపుగా పెరిగాయి. గ్రామానికి వెళ్లే ప్రాంగణంలో మేక్ ఇన్ మల్కాపూర్ యూత్ సభ్యులు వివిధ రకాల మొక్కలు నాటి మినీపార్కు ఏర్పాటు చేశారు. గ్రామ శివారులో పనికిరాకుండా బండరాళ్లతో కూడిన స్థలంలో మొక్కలు, పచ్చనిగడ్డి, వివిధ రకాల పూల మొక్కలు నాటి రాక్ నిర్మించుకున్నారు.