కొండాపూర్, జూన్ 23 : విపత్కర పరిస్థితుల్లోనూ అభివృద్ధి పనులు ఆగకుండా ముందుకు సాగుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. బుధవారం చందానగర్ డివిజన్ పరిధిలో రూ. 2.15 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తూనే మరోవైపు అభివృద్ధిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వానకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వరద సమస్యలు తలెత్తకుండా నాలాల విస్తరణతో పాటు పూడికతీత పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా, సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, డీఈ రూపాదేవి, ఏఈ అనురాగ్, వర్క్ఇన్స్పెక్టర్ జగదీశ్, శ్రీధర్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, నాయకులు దాసరి గోపి, వెంకటేశ్, గుడ్ల ధనలక్ష్మి, కరుణాకర్గౌడ్, జనార్ధన్రెడ్డి, రవీందర్డ్డ్రి, మిరియాల ప్రీతమ్, దాస్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.