నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’ ఓటీటీ రిలీజ్ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తొలుత ఈ నెల 11న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా సెకండ్వేవ్ ప్రభావంతో విడుదల వాయిదా పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్ రిలీజ్ వాణిజ్యపరంగా లాభదాయం కాదని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ థియేటర్ రిలీజ్కు వెళ్లినా ప్రేక్షకులు ఏ మేరకు వస్తారో అనే సంశయాలు ఉండటంతో ఓటీటీ వైపు దృష్టిపెట్టినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ చిత్రబృందంతో సంప్రదింపులు జరుపుతోందని చెబుతున్నారు. హిందీలో విజయవంతమైన ‘అంధాధున్’ ఆధారంగా మర్డర్ మిస్టరీ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. నభానటేష్, తమన్నా కథానాయికలుగా నటించారు. శ్రేష్ట్మూవీస్ పతాకంపై ఎన్.సుధాకర్రెడ్డి, నిఖితారెడ్డి నిర్మించారు.