జీఎస్టీతో వ్యాపారుల కష్టాలు తీరాయి

- కిరాణా మర్చంట్ అసోసియేషన్ మండలాధ్యక్షుడు రఘుప్రసన్న భట్
మక్తల్ రూరల్, జనవరి 26 : జీఎస్టీ అమలు చేసిన తర్వాత వ్యాపారుల కష్టాలు తీరాయని కిరాణా మర్చంట్ అసోసియేషన్ మండలాధ్యక్షుడు రఘుప్రసన్న భట్ తెలిపారు. పట్టణంలోని కిరాణా మర్చంట్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యవ ర్గ సమావేశంలో మంగళవారం నూతన అధ్యక్షుడిగా రఘుప్రసన్న భట్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జీఎస్టీ విధానాన్ని తీసుకోచ్చిన తర్వాత వ్యాపారులకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. దాదాపు 90 శాతం జీఎస్టీ బి ల్లులతోనే సరుకుల క్రయవిక్రయాలు జరుగుతున్నాయన్నారు. వ్యాపార లావాదేవీల్లో మ రింత పారదర్శకతతో ఎవరికి వారు తమ వృత్తులను కొనసాగిస్తుండడం అభినందనీయమన్నారు. అనంతరం రఘుప్రసన్న భట్ను వ్యాపారులు ఘనంగా సన్మానించారు. సమావేశంలో కిరాణ, జనరల్ సంఘం గౌరవ అధ్యక్షుడు నూర్పాషా, ప్రధాన కార్యదర్శి నాగరాజు, కోశాధికారి నరేశ్, ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, సురేశ్, విజయ్కుమార్, సంయుక్త కార్యదర్శి హరికృష్ణ పాల్గొన్నారు.
తాజావార్తలు
- రేపటి నుంచి పూర్తిస్థాయిలో రాజ్యసభ సమావేశాలు
- తిండి పెట్టే వ్యక్తి ఆసుపత్రిపాలు.. ఆకలితో అలమటించిన వీధి కుక్కలు
- నేటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం
- దోషులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
- వన్ప్లస్ 9 సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్
- వీడియో : కబడ్డీ ఆడిన నగరి ఎమ్మెల్యే రోజా
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- గుర్రంపై అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే
- మేఘన్కు సెరెనా విలియమ్స్ మద్దతు
- కోటాపై 50 శాతం పరిమితి : పున:సమీక్షించాలన్న సుప్రీంకోర్టు!