వ్యవసాయానికి ఈ టెక్నాలజీ ఎంతో మేలు
వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్రావు వెల్లడి
వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 17: ఫొటో వోల్టాయిక్ టెక్నాలజీతో సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తిచేసి వ్యవసాయరంగానికి అందిస్తే పంటల దిగుబడి పెరగటంతోపాటు, రైతుల ఆదాయాలు పెరుగుతాయని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ప్రవీణ్రావు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకనుగుణంగా వ్యవసాయాన్ని, సౌరశక్తిని సమ్మిళితం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఇందులో ఓ ఆలోచనే ఫొటోవోల్టాయిక్స్ అని చెప్పారు. ఈ సాంకేతిక ద్వారా 2004లో జపాన్లోని అకీర నగేషిమాలో విద్యుత్తు ప్లాంటు స్థాపించారని గుర్తుచేశారు. రాష్ట్రప్రభుత్వం సౌరశక్తి వినియోగాన్ని పెంచేందుకు అగ్రివోల్టాయిక్స్ హార్వెస్టింగ్ ది సన్ ఫర్ పవర్ అండ్ ఫుడ్ అనే నినాదంతో ముందడుగు వేస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ సుధీర్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ జగదీశ్వర్ పాల్గొన్నారు.