అందరి కృషితోనే కరోనా నియంత్రణ

- పేటలో టీకా కేంద్రాన్ని ప్రారంభించిన జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే
నారాయణపేట, జనవరి 16 : వైద్య, పోలీసు, రెవెన్యూ, పారిశుధ్య సిబ్బంది, ప్రజల కృషితోనే కరోనా ని యంత్రణ సాధ్యమైందని జెడ్పీ చైర్పర్సన్ వనజ, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పేట జిల్లా దవాఖానలో కొవిడ్ టీకా కేంద్రాన్ని వారు కలెక్టర్ హరిచందనతో కలిసి కలిసి ప్రారంభించారు. మొదటి టీకాను ఆశవర్కర్ శ్రీదేవికి, రెండో టీకాను భాగ్యమ్మకు ఇవ్వగా, ఎమ్మెల్యే, కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఒకేసారి పెద్ద మొత్తంలో టీకా పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమన్నారు. కొవిడ్ టీకా చాలా సురక్షితమైందన్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా టీకా వేసుకొని, సాధార ణ జీవనం కొనసాగించాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మూడు కేంద్రాల్లో 30 మంది చొప్పున 90 మందికి టీకా వేశామన్నారు. మొదటి విడుతలో జిల్లాకు 1,040 వాయిల్స్ వచ్చాయని, వీటిని ఫ్రంట్లైన్ వారియర్స్కు ఇస్తామన్నారు. సోమవారం నుంచి 12 కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పా రు. అలాగే మరికల్ పీహెచ్సీలో జెడ్పీ వైస్ చైర్మన్ సురేఖరెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, ఎంపీపీ శ్రీకళ వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. మొదటి టీకాను ఏఎన్ఎం స్వరూప కు ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ హరినారాయణ భట్టడ్, డీఎంహెచ్వో జయచంద్రమోహన్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డా.మల్లికార్జున్, ప్రత్యే క అధికారి జైపాల్రెడ్డి, జెడ్పీటీసీ అం జలి, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, వైద్య సిబ్బంది ఉ న్నారు.
తాజావార్తలు
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్
- ఐటీ సోదాలు.. బయటపడిన వెయ్యి కోట్ల అక్రమాస్తులు!
- సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం
- వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
- తమిళనాడు, కేరళలో అమిత్షా పర్యటన
- కాసేపట్లో మోదీ ర్యాలీ.. స్టేజ్పై మిథున్ చక్రవర్తి
- న్యూయార్క్లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా
- ఆరు రాష్ట్రాల్లోనే 84.71 శాతం కొత్త కేసులు: కేంద్రం
- ఫాస్టాగ్ కొంటున్నారా.. నకిలీలు ఉన్నాయి జాగ్రత్త!